New Year celebrations: ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) వంటి మహానగరాల్లో డిసెంబర్ 31 సాయంత్రం నుంచే యువత పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు.
Read Also: Highway Project: ప్యారడైజ్ నుంచి షామీర్పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం
సైబరాబాద్, రాచకొండలో పోలీస్ సర్వేల్స్, డ్రగ్స్ నియంత్రణ
ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేశారు. స్టార్ హోటళ్లు(star hotels), క్లబ్లు(clubs), పబ్లు(pubs), బార్(bars)ల నిర్వాహకులు వేడుకల నిర్వహణకు కనీసం 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. సెలబ్రేషన్స్కు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.
మైనర్ల ప్రవేశం నిషేధం, అతి శబ్దానికి పరిమితి
వేడుకల ప్రాంగణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాల(CC cameras) నిఘా ఉండాలని, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని, అసభ్య ప్రదర్శనలకు ఎలాంటి అవకాశం ఇవ్వరాదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలలోపు ఆపివేయాలని, ఇండోర్ ఈవెంట్లకు మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు పరిమిత శబ్దంతో అనుమతి ఉంటుందని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు.

బాణసంచా కాల్చడం, సామర్థ్యాన్ని మించి పాస్లు లేదా టికెట్లు జారీ చేయడం పూర్తిగా నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు. వాహనాల పార్కింగ్కు తగిన ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి వాటిని గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
మైనర్లకు వేడుకల్లో ప్రవేశం నిషేధమని, డ్రగ్స్ వినియోగంపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రతి ఏటిలాగే ఈసారి కూడా ఎక్సైజ్, నార్కోటిక్స్, పోలీస్ శాఖలు కలిసి పబ్లు, బార్లు, అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించనున్నాయి. డ్రగ్స్ గుర్తించేందుకు ఆధునిక పరికరాలు, డాగ్ స్క్వాడ్ బృందాలను వినియోగించనున్నారు.
హైదరాబాద్లో NYE వేడుకలు సురక్షితంగా జరగాలన్న లక్ష్యం
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపడతామని, మద్యం సేవించిన వారు తప్పనిసరిగా డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకున్నామని, నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: