हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Hyderabad: కూతురికి విషం ఇచ్చి ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి

Sharanya
Hyderabad: కూతురికి విషం ఇచ్చి ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి

హైదరాబాద్‌ నగర శివారులోని బాచుపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రగతినగర్‌లోని ఆదిత్య గార్డెన్స్ హరిత ఆర్కేడ్ అపార్ట్మెంట్స్‌లో నివసిస్తున్న నంబూరి కృష్ణ పావని అనే గృహిణి తన నాలుగేళ్ల కుమార్తె జశ్వికకు విషం ఇచ్చి, తాను కూడా తాగిన విషాదకర ఘటన 18వ తేదీన సాయంత్రం చోటు చేసుకుంది.

ఘటన వివరాలు

ఈ ఘటనలో చిన్నారి జశ్విక (4) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తల్లి కృష్ణ పావని (32) ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంబశివ రావు అనే వ్యక్తి, తన భార్య కృష్ణ పావని, కుమార్తె జశ్వికతో కలిసి నివసిస్తున్నాడు. సంఘటన జరిగిన సమయంలో సాంబశివ రావు ఇంట్లో లేని సమయాన్ని కృష్ణ పావని, తమ కూతురు జశ్వికకు మజాలో ఎలుక మందు తాగించి ఆ తర్వాత తాను తాగింది . శనివారం తెల్లవారుజామున తన భర్తకు ఈ విషయాన్ని తెలపడంతో, అతను వెంటనే ఇంటికి వచ్చి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించాడు. బాచుపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, కృష్ణ పావని అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని తెలుస్తోంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు. అయితే, అంతిమంగా పూర్తి విచారణ తరువాతే అసలు కారణాలు స్పష్టమవుతాయి. చిన్నారి జశ్విక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆమెపై ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read also: Bhatti Vikramarka: హెచ్‌సీయూ విద్యార్థుల కేసుల తొలగింపుపై..భట్టి చెప్పినవి వట్టి మాటలేనా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870