📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

HYD Metro : హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం

Author Icon By Sudheer
Updated: November 5, 2025 • 8:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రయాణికులకు భద్రత కోసం హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్.. అనేక చర్యలు చేపడుతోంది. నిత్యం ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర పనుల కోసం మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రద్దీ సమయాల్లో మెట్రో స్టేషన్లు.. ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. నిత్యం మెట్రో రైళ్లలో లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. దీంతో కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండా స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌లు నిండిపోతున్నాయి. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మెట్రో అధికారులు చూస్తున్నారు.

ఇక మెట్రో రైలు వచ్చే సమయంలో ప్లాట్‌ఫామ్‌పైకి వస్తున్న ప్రయాణికుల మధ్య తోపులాటలు చోటు చేసుకుంటుండటంతో.. వారు రైలు పట్టాలపై పడే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మెట్రో అధికారులు ముందుగానే అలర్ట్ అవుతున్నారు. మెట్రో ప్లాట్‌ఫామ్‌లపై స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మెట్రో రైలు డోర్ల వద్ద కాకుండా కోచ్‌ల పొడవునా.. ప్లాట్‌ఫామ్‌పై ఈ ఉక్కు కంచెను ఏర్పాటు చేయనున్నారు.

Latest News: Crop Loss: తుఫాన్‌ పంట నష్టాల రిజిస్ట్రేషన్ గడువు పెంపు!

మొదట కొన్ని స్టేషన్లలో ఈ స్టీల్ గ్రిల్స్‌ను ఏర్పాటు చేసి.. అవి ఏ రకంగా పనిచేస్తున్నాయో చూసి.. ఆ తర్వాత క్రమంగా మిగిలిన స్టేషన్లకు విస్తరించాలని భావిస్తున్నారు. వచ్చే రెండున్నర సంవత్సరాల్లో నగరవ్యాప్తంగా అన్ని స్టేషన్లలోనూ ఈ స్టీల్ గ్రిల్స్ తీసుకురావాలని యోచిస్తున్నారు. అయితే ఈ స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయడం పట్ల ప్రయాణికులు, నెటిజన్ల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మెట్రో రైలు వద్ద గ్రిల్స్ ఏర్పాటు చేయడం వల్ల.. తోపులాటలు జరిగినా ప్రయాణికులు పట్టాలపై పడి ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలు కాకుండా ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు.

ఇలా చేయడం వల్ల చాలా ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చని చెబుతున్నారు. అయితే ఇవి ఇప్పటికే ఏర్పాటు చేయాల్సిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ మొత్తమే ఏర్పాటు చేయకపోవడం కన్నా ఆలస్యంగానైనా ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషం అంటూ చెబుతున్నారు.

కానీ కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలా స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయడం వల్ల.. మెట్రో రైలు, గ్రిల్స్ మధ్య ప్రయాణికులు ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మెట్రో రైలు ప్లా్ట్‌ఫామ్‌పైకి రాగానే అందులోకి ఎక్కేందుకు ఒకేసారి ప్రయాణికులు అంతా ఎగబడితే తోపులాట జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇక రైలు ఎక్కి, దిగే ప్రయాణికులకు ఈ స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయడం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu hyderabad Hyderabad Metro Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.