हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hyderabad: అధిక వర్షాలు కురుస్తున్న హైదరాబాద్ లో భూగర్భజలాలు పెరగలే

Sharanya
Hyderabad: అధిక వర్షాలు కురుస్తున్న హైదరాబాద్ లో భూగర్భజలాలు పెరగలే

హైదరాబాద్ (Hyderabad) నగరంపై గత కొన్ని సంవత్సరాలుగా కుండపోత వానలు పడుతున్నా, భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. సాధారణంగా ఎక్కువ వర్షాలు పడితే భూమిలోకి నీరు ఇంకి భూగర్భ జలాల నిల్వలు పుష్కలంగా పెరగాలి. కానీ నగరంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. దీనికి ప్రధాన కారణం నగరం వేగంగా కాంక్రీట్ అరణ్యంగా మారడమే. భారీ భవనాలు, రోడ్లు, వాణిజ్య కాంప్లెక్స్‌లు విస్తరించడంతో ప్రకృతి దృశ్యాలు తగ్గిపోయాయి. వర్షపు నీరు నేలలోకి ఇంకే అవకాశం లేకుండా కాలువల ద్వారా నేరుగా నదుల్లోకి, చెరువుల్లోకి పోతోంది.

పూడికతో నిండిన చెరువులు – భూగర్భ జలాలకు ఆటంకం

ఔటర్ రింగ్​ రోడ్డు వరకు వెయ్యి చెరువులు ఉన్నప్పటికీ అక్కడ కూడా భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందడం లేదు. ప్రస్తుత రోజుల్లో పూడిక సమస్య నానాటికీ పెరుగుతోంది. ఈ దుస్థితి నుంచి భాగ్యనగరాన్ని రక్షించడమే లక్ష్యంగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) రంగంలోకి దిగింది. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో కలిసి రాజధానిలోని చెరువులు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో హైడ్రాలజీ సర్వేకు శ్రీకారం చుట్టింది.

హైడ్రా కార్యాచరణ ప్రారంభం

ఈ సమస్యల నేపథ్యంలో హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) రంగంలోకి దిగింది. మొదట ఐదు సరస్సులపై సర్వే చేపట్టి, నెలాఖరులోపు సర్కారుకు నివేదిక పంపాలని హైడ్రా కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ తాజాగా ఆయా సంస్థలకు లక్ష్యాన్ని నిర్దేశించి ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఆధారంగా వరదలను నివారించడానికి చర్యలు, భూగర్భ జలాల పెంపునకు అవసరమైన కార్యాచరణ రూపొందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు.

హైడ్రాలజీ సర్వేలో ఏం పరిశీలిస్తున్నారు?

ఈ సర్వే ద్వారా చెరువుల స్థితి, వాటి నీటి నిల్వ సామర్థ్యం, క్యాచ్‌మెంట్ ఏరియా, వరద సమయంలో నీటి ప్రవాహ మార్గాలు వంటి అంశాలను వివరంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా

చెరువుల వద్ద ఉన్న తూములు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలిస్తారు.

వర్షపు నీరు ఎంత భాగం భూమిలోకి ఇంకుతోందో గుర్తిస్తారు.

వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి, నివారణ చర్యలు రూపొందిస్తారు.

పూడికతీత అవసరాలను విశ్లేషిస్తారు.

చెరువుల్లోకి ప్రవహించే కాలువలు మరియు అవుట్‌ఫ్లో మార్గాలను పరిశీలిస్తారు.

తటాకాల వద్దనున్న ఆయా పరిస్థితులు, క్యాచ్‌మెంట్‌ ఏరియా పరిధి, దాని పరిధిలో ఎంత వర్షం, ఎంత సమయంపాటు కురిస్తే చెరువు ఎంత సమయంలో నిండుతుంది, ఇతరత్రా ప్రశ్నలకు సర్వే ద్వారా తెలుసుకుంటారు.

వరద నీటి కొఎఫిషియంట్ – ఆందోళనకర గణాంకాలు

గ్రేటర్‌ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో వరదనీటి కొఎఫిషియంట్‌ విలువ 0.97గా ఉన్నట్టు నిపుణులు హైడ్రాకు తెలిపారు. అంటే ప్రతి 100 లీటర్ల వరదలో 97 లీటర్లు ప్రవాహంలోనే కొట్టుకుపోతోందన్న మాట. భూమిలోకి ఇంకుతున్న నీరు 3 లీటర్లుగా మాత్రమే ఉందని జేఎన్‌టీయూ నిపుణులు హైడ్రాకు వెల్లడించారు. కొఎఫిషియంట్‌ విలువను తగ్గించేందుకు హైడ్రాలజీ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరద నివారణ చర్యలు, ఇంకుడుగుంతలు, కృత్రిమ చెరువుల తవ్వకాలు, చెరువుల్లో పూడికతీత పనులు, మురుగునీటి మళ్లింపు వంటి చర్యలు అవసరమన్నారు.

Read also: Film Awards: ఏపీ లోనూ త్వరలో ఫిలిం అవార్డులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870