📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Hyderabad: జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు

Author Icon By Pooja
Updated: December 20, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్(Hyderabad) మహానగర రూపురేఖలు మరోసారి మారేందుకు సిద్ధమయ్యాయి. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, సమగ్ర పాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర శివార్లలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో కలిపింది. ఈ ప్రక్రియతో సుమారు 3 వేల కాలనీల అధికారిక చిరునామాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అదే సమయంలో 100కు పైగా కొత్త డివిజన్లు కూడా ఏర్పాటు చేశారు.

Read Also: Telangana: కాంగ్రెస్ పాలనపై జల ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం?

GHMC expansion… changes in the addresses of 3,000 colonies.

20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనం.. 3 వేల కాలనీల చిరునామాలు మారనున్నాయి

ఈ విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు సుమారు 650 చదరపు కిలోమీటర్లకు పరిమితమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధి, తాజాగా 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం డిసెంబర్ 1న జారీ చేసింది.

విలీన ప్రక్రియతో పాటు డివిజన్ల పునర్విభజన పనులను జీహెచ్ఎంసీ అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో పూర్తి చేశారు. కొత్త డివిజన్ల(Hyderabad) హద్దులపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి అవసరమైన మార్పులు చేశారు. శివరాంపల్లిని సులేమాన్‌నగర్‌లో కలపడం వంటి అంశాలపై వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ అంశాలపై రూపొందించిన తుది నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఫైనల్ గెజిట్‌ను విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా, ఇంత విస్తారమైన నగరాన్ని ఒకే పాలనా వ్యవస్థ కింద నిర్వహించడం సాధ్యమా? అన్న అంశంపై ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలను కూడా పరిశీలిస్తోంది. అవసరమైతే జీహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. 2026 జనగణన పూర్తైన తర్వాత, 2027లో వెలువడే జనాభా గణాంకాల ఆధారంగా మరోసారి డివిజన్ల పునర్విభజన జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

GHMCExpansion Google News in Telugu Latest News in Telugu MunicipalMerger

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.