Hyderabad fake call centre : హైదరాబాద్లోని మాధాపూర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా పౌరులను టార్గెట్ చేసుకుని రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
“రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్” పేరుతో ఐటీ సేవల సంస్థలా నటిస్తూ ఈ కాల్ సెంటర్ కార్యకలాపాలు సాగించినట్టు తేలింది. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), సైబర్ క్రైం పోలీసుల సంయుక్త దాడుల్లో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా పలువురి పాత్రపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మోసం ఎలా చేసేవారు?
నకిలీ పాప్-అప్స్, ఈమెయిల్స్ పంపి ఆస్ట్రేలియన్ల కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని (Hyderabad fake call centre) భయపెట్టేవారు. ఆ పాప్-అప్లో ఉన్న కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేస్తే, అది నేరుగా నకిలీ కాల్ సెంటర్కు కనెక్ట్ అయ్యేది. తర్వాత AnyDesk లాంటి రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించి, బ్యాంక్ వివరాలు దొంగిలించి డబ్బు కాజేసేవారు.
డబ్బు ఎలా తరలించేవారు?
మోసంతో సంపాదించిన డబ్బును ముందుగా ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయ విద్యార్థులు, వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసి, ఆ తర్వాత హవాలా మార్గాలు, క్రిప్టో కరెన్సీ ద్వారా భారత్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Read also: Garima Agrawal: సిరిసిల్లలో దివ్యాంగుల మహోత్సవం
కీలక నిందితులు ఎవరు?
ఖమ్మం జిల్లాకు చెందిన బంధువులు ప్రవీణ్, ప్రకాష్ ఈ రాకెట్కు ప్రధాన సూత్రధారులని పోలీసులు గుర్తించారు. కోల్కతా నుంచి ఏడుగురు టెలీకాలర్లను రప్పించి, సైబర్ మోసాలపై శిక్షణ ఇచ్చారు. కార్యాలయ నిర్వహణ బాధ్యతలను ఖమ్మంకు చెందిన ఇద్దరు స్థానికులు చూసుకునేవారు.
దాడిలో 12 కంప్యూటర్లు, 21 మొబైళ్లు, రౌటర్లు, ఖరీదైన కారు సహా కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల హెచ్చరిక
విదేశాల్లో ఉన్న విద్యార్థులు, ఎన్నారైలు తమ బ్యాంక్ అకౌంట్లను ఎవరికీ ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: