📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Hyderabad: న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు

Author Icon By Anusha
Updated: December 31, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Hyderabad) లో, న్యూ ఇయర్ వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, కీలక రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు.

Read Also: Telangana: యూరియాకు ప్రత్యేక అధికారులు

ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలివచ్చే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్ పరిసర ప్రాంతాలను ‘నో ఎంట్రీ’ జోన్లుగా ప్రకటించారు. ప్రత్యేకంగా, ఫ్లైట్‌ టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే పీవీ ఎక్స్‌ప్రెస్ రోడ్ ద్వారా అనుమతి ఇవ్వబడింది. అలాగే రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సిటీలోకి ప్రవేశించరాదని అధికారులు వెల్లడించారు. మెట్రో రైళ్లు కూడా నూతన సంవత్సర వేడుకలకు అనుగుణంగా ప్రత్యేక షెడ్యూల్‌లో నడపబడతాయి.

Hyderabad: CP Sajjanar warns people on New Year’s Eve

మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులు

సాధారణంగా రాత్రి 11 గంటలకు చివరి సర్వీస్ ప్రారంభమవుతుంది, కానీ డిసెంబర్ 31న స్టార్టింగ్ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరతాయి. అలాగే, సికింద్రాబాద్, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణికుల డిమాండ్, రద్దీ ప్రకారం ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యంగా నడిపేలా ఏర్పాట్లు చేశారు.సీపీ సజ్జనార్‌ నగర పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు.

తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపించడం, రోడ్లపై హడావుడి చేయడం, బాణాసంచాలు, కేక్‌ల ద్వారా శబ్ధ కలిగించడం, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలు పూర్తిగా నిషేధమని తెలిపారు. యువత రైడ్‌లలో ప్రమాదకర విన్యాసాలు, సైలెన్సర్లు తీసివేసి శబ్ధ కాలుష్యం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సంవత్సరాన్ని ప్రశాంత వాతావరణంలో, తమ ఇళ్ల వద్ద జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CP Sajjanar hyderabad latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.