GHMC new act Telangana : Revanth Reddy హైదరాబాద్ నగర అభివృద్ధి పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న మూడు కార్పొరేషన్లకు ప్రస్తుతం అమల్లో ఉన్న Greater Hyderabad Municipal Corporation (జీహెచ్ఎంసీ) చట్టానికి బదులుగా ప్రత్యేకంగా “కోర్ అర్బన్ చట్టం” రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, పన్నుల విధానం, నిర్మాణ అనుమతులు మరియు పరిపాలనా కార్యకలాపాలు ఈ కొత్త చట్టం ఆధారంగా నిర్వహించబడాలని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతంలో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. శానిటేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం, దోమల నివారణ చర్యలను వేగవంతం చేయడం, చెత్త వేయడానికి గుర్తించిన ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Virosh Wedding: ప్రధాని మోదీని కలిసిన విజయ్ దేవరకొండ దంపతులు

రోడ్ల నిర్మాణం మరియు నిర్వహణలో విభాగాల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. స్ట్రీట్ లైట్లకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చి డ్యాష్బోర్డ్కు అనుసంధానం చేయాలని సూచించారు. ఆహార భద్రతపై దృష్టి సారిస్తూ హోటళ్ల వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని తెలిపారు.
ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, ఆర్ & బీ మరియు ఇతర విభాగాల రోడ్లను పురపాలక శాఖ పరిధిలోకి తీసుకురావడం, ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని గడువులో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. హైడ్రా ఆధ్వర్యంలో పరిరక్షించబడిన చెరువులను సంరక్షించి, సుందరీకరించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు.
ఈ కొత్త చట్టం ద్వారా కోర్ అర్బన్ ప్రాంతాల్లో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధిని వేగవంతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: