తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఏటా ఒకసారి జరిగే కార్యక్రమం – చేప మందు (Fish Prasadam). ఇది ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, శ్వాస సంబంధిత వ్యాధులకు శాశ్వత పరిష్కారం కలిగించగలదనే విశ్వాసంతో వేలాది మంది ఈ మందును స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా వస్తుంటారు. బత్తిన కుటుంబ సభ్యులు గత 170 సంవత్సరాలుగా ఈ మందును ప్రజలకు ఉచితంగా అందజేస్తూ వస్తున్నారు.

మృగశిర కార్తె – చేప మందుకు కీలకమైన తిథి
మృగశిర కార్తె అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది చేప మందు ప్రసాదం. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబ సభ్యులు ఏటా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. 170 సంవత్సరాల నుంచి చేప ప్రసాదాన్ని బత్తిన వంశస్థులు ఆస్తమా రోగులకు పంపిణీ చేస్తున్నారు. ఈ యేడు కూడా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించే బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. జూన్ 8వ తేదీన మృగశిర ప్రవేశిస్తుండగా ఏర్పాట్లు పూర్తయినట్టు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పరిపూర్ణ ఏర్పాట్లు – భోజనం, బస్సులు, వసతి సౌకర్యాలు
ఈ ఏడాది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రోగులు, వారి సహాయకుల కోసం భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నగరంలో అన్ని చోట్ల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ మందు కోసం వేలాది మంది ప్రజలు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకుంటున్నారు.
ప్రజల విశ్వాసానికి నిలువెత్తు ఉదాహరణ
ఈ చేప మందును స్వీకరించేందుకు ప్రజలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు.పేద, ధనిక అనే తేడా లేకుండా, అన్ని వర్గాల ప్రజలు ఈ మందుపై నమ్మకంతో తరలివస్తారు.
బత్తిన కుటుంబంలో చేప మందు విశిష్టత
బత్తిని కుటుంబీకులు పంపిణీ చేస్తున్న చేప మందు ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి చాలా మంచిదని ఎన్నో ఏళ్లుగా నమ్మకంతో ఇక్కడి వస్తుంటారు బాధితులు. అయితే ఈసారి కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
Read also: Revanth Reddy: తెలంగాణ కేబినెట్ విస్తరణకు అధిష్ఠానం ఆమోదం