హైదరాబాద్ (Hyderabad), నగరంగా పేరుపొందిన ఈ నగరంలో ఇటీవల గగన్పహాడ్ – ఆరాంఘర్ (Arangur) ప్రధాన రహదారిపై జరిగిన ఓ ఘటన నగర ప్రజలను షాక్కు గురిచేసింది. ఏకంగా 8 మంది యువకులు ఒకే బైక్ పై ప్రయాణించిన దృశ్యం, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం రూల్ బ్రేకింగ్ కాదు, శాశ్వత ప్రమాదానికి ఆహ్వానం పలికిన చర్యగా భావించవచ్చు.
ట్రాఫిక్ నిబంధనలను ధిక్కరించిన నిర్లక్ష్య చేష్టలు
సాధారణంగా రెండు మందికి మాత్రమే అనుమతిచ్చే ద్విచక్రవాహనం (Two-wheeler) లో అత్యధికంగా ముగ్గురు ప్రయాణించడాన్ని ట్రిపుల్ రైడింగ్గా పరిగణించి పోలీసులు ఫైన్ వేస్తుంటారు. కానీ ఇక్కడ కొందరు యువకులు అవేవీ లెక్కచేయకుండా, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా, ప్రాణాలకు తెగించే విన్యాసాలు చేశారు. ఒకే బైక్పై ఏకంగా 8 మంది గుంపుగా ఎక్కి నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లపై చెక్కర్లు కొట్టారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించారు.
వీడియో వైరల్ – పోలీసుల స్పందన వేగవంతం
ఒక కారులో ప్రయాణిస్తున్న బాధ్యతగల వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో (social media) పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ అయి ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్.. ఆ వీడియోను పరిశీలించి.. అందులో కనిపించిన బైక్ నంబర్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. బైక్ యజమానితో పాటు బైక్పై ఉన్న మొత్తం 8 మందిని సోమవారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ట్రాఫిక్ నిబంధనలు కావాలని అతిక్రమించిన వారిపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు.
కఠిన చట్టపరమైన చర్యలు
పోలీసుల ప్రకారం, ఇటువంటి ఘటనలు అత్యంత గంభీరంగా పరిగణించాల్సినవిగా ఉన్నాయి. యువత ఈ తరహా ప్రవర్తనతో తమ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెట్టే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణం ప్రమాదాలకు దారి తీస్తుందని. అంతేకాదు ఇలాంటి స్టంట్స్ చేయడం తీవ్రమైన నేరమని పోలీసులు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో రీల్స్ కోసం, ఫ్రెండ్స్తో సరదాకోసం స్టంట్స్ చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయి హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
సామాజిక బాధ్యత – యువతకు సందేశం
ఈ సంఘటన ద్వారా మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం యువత సరదాలో కానీ, ప్రచార దాహంతో కానీ ప్రాణాలతో ఆటలాడకూడదు. రోడ్లపై ఒక్కో నిమిషం నిర్లక్ష్యం చాలా మంది జీవితాలను పొట్టనపెట్టవచ్చు.
Read also: Mahesh Kumar Goud: బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంపై మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు స్పందన
Telangana Weather: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు
Local body elections: సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హై కోర్టు తీర్పు