📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: HYD: స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కడియం శ్రీహరి భేటీ

Author Icon By Sushmitha
Updated: November 22, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజీనామాకు సిద్ధమైన దానం నాగేందర్?

హైదరాబాద్: HYD ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరుతూ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) గురువారం మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కడియం శ్రీహరి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 23వ తేదీ లోపు ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. దీంతో వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్పీకర్‌ను కడియం శ్రీహరి కోరారు. ఈ విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Read Also: AP: ఆసుపత్రులో కొత్తగా 15 న్యూట్రిషన్ కేంద్రాలు

HYD Kadiyam Srihari meets Speaker Gaddam Prasad

దానం నాగేందర్ రాజీనామాపై ప్రచారం

ఢిల్లీ నుంచి రాగానే దానం నాగేందర్ కూడా స్పీకర్‌ను కలవనున్నారు. అయితే ఆయన వివరణ ఇవ్వడానికి మరింత సమయం కోరుతారా, లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత మంత్రివర్గంలో చేరి, ఉప ఎన్నికల్లో గెలవాలని ఆయన యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విచారణ పురోగతి

గత ఆగస్టులో ఫిర్యాదులొచ్చిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి (Kadiyam Srihari) మినహా మిగిలిన 8 మంది తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేయడంతో పాటు ఇటీవల వరకు స్పీకర్ వద్ద విచారణకు హాజరయ్యారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BRS defections Danam Nagender Google News in Telugu Kadiyam Srihari Latest News in Telugu MLA Disqualification political controversy. Telangana Speaker Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.