హైదరాబాద్: HYD దేశంలో అత్యంత విలువైన వక్ఫ్ భూములున్న రాష్ట్రాల్లో తెలంగాణ (Telangana) ఒకటిగా నిలిచింది. వక్ఫ్ బోర్డుకు (Waqf Board) దాదాపు రూ.5 లక్షల కోట్ల విలువగల భూములున్నా, అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. వక్ఫ్ బోర్డుకు చెందిన కొందరు అధికారులు, పాలకవర్గాల అవినీతి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ భూముల్లో 75 శాతం అంటే సుమారు రూ.4 లక్షల కోట్ల ఆస్తులు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని బోర్డు అధికారులే అంచనా వేశారు. వక్ఫ్ బోర్డుకు చెందిన 2,186 భూములకు సంబంధించిన రికార్డులు కూడా లేవని గతంలో హైకోర్టుకు బోర్డు తెలిపింది.
Read Also: Free sarees scheme: తెలంగాణ ఎస్హెచ్జీ మహిళలకు ఉచిత చీరల పంపిణీ
ఉమ్మడి జిల్లాల వారీగా అన్యాక్రాంతమైన భూములు
తెలంగాణలో మొత్తం 33,929 వక్ఫ్ సంస్థల ఆధీనంలో 77,538.07 ఎకరాల భూములు ఉన్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందులో 57,423.91 ఎకరాలు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి.
- ఉమ్మడి మెదక్ జిల్లా: 23,910 ఎకరాలకు గాను 23,782 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి (అత్యధికం).
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: 10,119 ఎకరాలకు గాను 9,189 ఎకరాలు కబ్జా అయ్యాయి.
- రంగారెడ్డి: 14,785 ఎకరాల్లో 13,480 ఎకరాలు.
- హైదరాబాద్: 1,785 ఎకరాల్లో 1,469 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.
- మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ వేలాది ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది.
అరకొర ఆదాయం, లీజుల వ్యవహారం
కోట్లాది రూపాయల విలువగల భూములున్నా, అవి కబ్జా పాలవడం, నామమాత్రపు అద్దెలు చెల్లించడం వల్ల వక్ఫ్ బోర్డుకు ఆదాయం అరకొరగా మాత్రమే వస్తుంది. వక్ఫ్ బోర్డుకు అద్దెల రూపంలో ఏడాదికి కేవలం రూ.5 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. దాదాపు 20,110 ఎకరాల్లో ఉన్న లీజుదారులు కొన్నేళ్ల క్రితం నిర్ణయించిన నామమాత్రపు అద్దెలనే చెల్లిస్తున్నారు. ముస్లింల విద్యాభివృద్ధి, పేదల ఉపాధికి ఉపయోగపడాల్సిన వక్ఫ్ ఆస్తులను వినియోగించుకోవాలని పాలకవర్గాలకు సూచించినా, ప్రముఖులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: