హైదరాబాద్ (HYD) నగరంలోని అత్యంత కీలకమైన నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ శనివారం
ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: CM Revanth : కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
ఉన్నత స్థాయి విచారణ జరగాలి
ప్రమాదం జరిగిన చోటే వివిధ సంచలన కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు ఉన్నట్లు సమాచారం. డిజిటల్ సాక్ష్యాలు అగ్నికి ఆహుతి కావడంతో దర్యాప్తు సంస్థల్లో ఆందోళన మొదలైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు.పోలీసు శాఖకు అత్యంత కీలకమైన, గట్టి భద్రత ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని,

అనేక సున్నితమైన కేసులకు సంబంధించిన ఆధారాలు (2015 నాటి ఓటుకు నోటు కేసుతో సహా ) ఇందులో భద్రపరచి ఉన్నాయని పేర్కొన్నారు. వాటి పరిస్థితి ఏమిటి? దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆధారాల నిర్మూలనకు ప్రస్తుత పాలకులు ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. అమెరికాలో ఎంతోమంది చిన్నారులను అపర కుబేరులకు అర్పించిన లైంగిక నేరస్తుడు ఎప్స్టీన్ జైలులో అనుమానాస్పదంగా చనిపోయాడని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: