హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టింది. లాలాగూడ–లాలాపేట (Lalapet) ప్రాంతంలో అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కీసర నుంచి తార్నాక వైపు టిఫిన్ కోసం బయలుదేరిన నలుగురు స్నేహితులు లాలాపేట జంక్షన్ వద్దకు చేరుకున్నప్పుడు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 6 గంటల సమయంలో అదుపు కోల్పోయిన కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు వాహనం పూర్తిగా దెబ్బతింది.
Read also: US-Hyderabad Tragedy: USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

Fatal road accident in Lalapeta
అతివేగమే కారణమని
ఈ ఘటనలో మల్కాజ్గిరికి చెందిన హర్షిత్ రెడ్డి (22), చెంగిచర్లకు చెందిన శివమణి (23) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలగగా, వాహనాన్ని తొలగించి మార్గాన్ని క్లియర్ చేయడం జరిగింది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: