రాష్ట్రంలో (HYD) పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల అసమర్థత కారణంగా, ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో సమయానికి జమ కావడం లేదు. ముఖ్యంగా, మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ (Bank Guarantee) తీసుకోవడంలో అధికారులు విఫలం కావడంతో, ధాన్యం కేటాయింపులు కొద్ది సంఖ్యలో మిల్లులకు భారీగా కేటాయిస్తున్నారు.
Read Also: Kavitha: మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు
కొనుగోలు వివరాలు:
- తెలంగాణ వ్యాప్తంగా 8,410 కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికి వచ్చింది.
- ఇందులో రూ. 12,269 కోట్ల విలువ గల 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
- కొనుగోలు చేసిన ధాన్యంలో 24 లక్షల మె.ట దొడ్డు రకం మరియు 23 లక్షల మె.ట సన్న ధాన్యం ఉంది.
- ఇప్పటివరకు ఎంఎస్పీ (MSP) కింద రూ. 9,845 కోట్లు రైతులకు చెల్లించారు.
- అయితే, 2.09 లక్షల రైతుల ఖాతాల్లో సుమారు రూ. 2,424 కోట్ల రూపాయలు గత వారం రోజులుగా జమ కావడం లేదు.
మరోవైపు, కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి వచ్చిన 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తుండటంతో రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
మిల్లు కేటాయింపులు, గ్యారెంటీ సమస్యలు: రైతులు అనిశ్చితిలో
ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (Online Procurement Management System) లో మిల్లు జనరేట్ కాకపోవడంతో, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు పంపడమే సవాల్గా మారింది. తెలంగాణలో మూడు వేలకు పైగా రైస్ మిల్లులు ఉండగా, అందులో దాదాపు వెయ్యి వరకు సీఎంఆర్ (Custom Milled Rice) ఇవ్వని బకాయిదారులు ఉన్నారు. వీరికి ధాన్యం కేటాయించడం లేదు. మరోవైపు, బ్యాంకు గ్యారెంటీలు తీసుకోవడంలో కూడా అధికారులు విఫలం కావడంతో ధాన్యం సేకరణపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
- కరీంనగర్ జిల్లాలో: 127 మిల్లులు ఉంటే, అందులో 54 మిల్లులు డిఫాల్టర్ మిల్లులు. మిగిలిన 73 మిల్లులలో కేవలం పది శాతం మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారెంటీ ఇచ్చినట్లు రైస్ మిల్లర్లు చర్చించుకుంటున్నారు.
- వనపర్తి జిల్లాలో: 53 మిల్లులు మాత్రమే అరకొర బ్యాంకు గ్యారెంటీలు చెల్లించినప్పటికీ, ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. అయితే, ఆ జిల్లాలో 21 మిల్లులకు ధాన్యం కేటాయించకూడదని రాష్ట్ర స్థాయి అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. వనపర్తిలో బ్యాంకు గ్యారెంటీ కింద 10% చొప్పున రూ. 47 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 16 కోట్లు మాత్రమే చెల్లించారు.
- నిరాకరిస్తున్న జిల్లాలు: నల్లగొండ, సూర్యపేట, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక రైస్ మిల్లులు 10% బ్యాంకు గ్యారెంటీలు చెల్లించడానికి నిరాకరిస్తున్నాయి.
రబీ సీజన్ ఆరంభం కావడంతో రైతులు ధాన్యం విక్రయాలకు కేంద్రాలలో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు, మిల్లు పాయింట్కు ధాన్యం చేరినా ఎంఎస్పీ రాక రైతులు అనిశ్చితికి గురవుతున్నారు.
బోనస్ చెల్లింపుపై భిన్నాభిప్రాయాలు
సివిల్ సప్లయ్ అధికారులు ఇప్పటి వరకు సన్నాలకు రూ. 412 కోట్ల రూపాయలు బోనస్ చెల్లించామని చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం గత యాసంగి బోనస్ మరియు ఇప్పటి ఖరీఫ్ సీజన్ బోనస్ కూడా తమకు రాలేదని ఆరోపిస్తున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ (Telangana) రీజియన్లో కొన్ని మెట్టప్రాంతాలకు పరిమితమైన వరిధాన్యం పంట, ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లోనూ విస్తరించడంతో ధాన్యం దిగుబడి పెరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: