Telugu News: Hyd Crime: తల్లిదండ్రులు మందలించారని పదోతరగతి బాలిక ఆత్మహత్య

Read Time:  1 min
Hyd Crime
Hyd Crime
FONT SIZE
GET APP

తమ బిడ్డలు బాగా చదవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుని, కష్టపడి సంపాదించిన డబ్బంతా పిల్లల చదువులకే కేటాయిస్తారు. వారి ఉజ్వల భవితకోసం ఎన్నో కలలు కంటారు. తమను ఉద్దరించకపోయినా వారి జీవితాలను సౌకర్యవంతంగా జీవిస్తే చాలని ఆశిస్తారు. అందుకోసం పిల్లలు అడిగినవన్నీ కొనిస్తుంటారు. సరిగ్గా చదవకపోతే చదవమని చెబుతారు. ఇంకా నిర్లక్ష్యంగా చదువుపై శ్రద్ధ లేకపోతే గద్దిస్తారు. 

Read also : PM Modi : అయోధ్యలో మోదీ ప్రత్యేక పర్యటన రామమందిరంపై..

Hyd Crime
Hyd Crime Tenth grade girl commits suicide after being scolded by parents

ఇదంతా వారికి ప్రేమ లేకకాదు, తమ బిడ్డల బాగుకోసమే. ప్రేమించేవారు గద్దిస్తారు. కానీ ఈ సున్నిత భావాలను పిల్లలు కూడా గ్రహించాలి. కానీ ఆ భావానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే మాత్రం వాటి పర్వవస్థానాలు భిన్నంగా ఉంటారు. కొన్నిసార్లు ఊహించని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలాంటి నిర్ణయమే ఓ బాలిక తీసుకుంది.

పైనుంచి దూకిన బాలిక

హైదరాబాద్ లోని (Hyd Crime) హబ్సిగూడ (Habsiguda) పరిధిలో పదోతరగతి చదువువున్న ఓ బాలిక మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించారు. చక్కగా చదువుకోవాలని బుద్ధి చెప్పారు. బోర్డు పరీక్షలు రాయాలి కాబట్టి చదువుపై శ్రద్ధ చూపాలని కోరారు. కానీ ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకుంది.

బాలిక (15) బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తీవ్రగాయాలతో మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ బిడ్డ అందరిలా చక్కగా చద వాలనే కోరిక మందలించామే తప్ప చావు కోరలేదని ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నేటి విద్యార్థులు చాలా సున్నితంగా మారుతున్నారు. చిన్నవిషయాలకే ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read also :

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.