Latest News: Hyd Crime: కారు ప్రమాదంలోదుర్మరణమైన వ్యక్తి హనుమకొండ వాసిగా గుర్తింపు

Read Time:  1 min
Latest News: Hyd Crime: కారు ప్రమాదంలోదుర్మరణమైన వ్యక్తి హనుమకొండ వాసిగా గుర్తింపు
FONT SIZE
GET APP

(Hyd Crime) ORRపై జరిగిన ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తి దుర్గాప్రసాద్ (34)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ ప్రాంత వాసి అని తెలిపారు. నగరంలో వ్యాపారం నిమిత్తం వచ్చి ఇంటికి వెళ్లేందుకు దుండిగల్లోని ORR వైపు మళ్లించాడని, శామీర్పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఉదయం 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Read Also: CyberCrime: శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ మోసం

Hyd Crime: Man who died in car accident identified as Hanumakonda resident
Hyd Crime: Man who died in car accident identified as Hanumakonda resident

ఏసీ ఆన్ చేసి నిద్రించాడా?

ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం.. కారు డ్రైవర్ వాహనాన్ని రింగ్ రోడ్డు పక్కన ఆపి ఏసీ వేసుకొని కారులోనే నిద్రిస్తున్న సమయంలోనే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్‌కు బయటకు వచ్చే అవకాశం దొరకలేదు. కారు పూర్తిగా కాలి బూడిదైంది.

సమాచారం అందుకున్న వెంటనే శామీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను, అలాగే మృతుడి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.