📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

HYD: వరంగల్ భద్రకాళి అమ్మవారికి భక్తుడి భారీ కానుక

Author Icon By Saritha
Updated: January 30, 2026 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరంగల్ (Warangal) నగరంలో కొలువైన భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పవల్లిగా అమ్మవారికి ప్రసిద్ధి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చి, తమ శక్తిమేర కానుకలు సమర్పిస్తారు. ఈ క్రమంలో (HYD) తాజాగా ఒక కుటుంబం భద్రకాళి అమ్మవారికి అత్యంత విలువైన కానుకను సమర్పించింది. 111 కేజీల వెండి కవచాన్ని అమ్మవారికి విరాళంగా అందజేసింది.

Read Also: Sammkka Saralamma: మేడారం జాతరలో భక్తులపై పోలీసుల దాడి..

సుమారు 4.5 కోట్లు ఖర్చు అయిన వెండి కవచం

హైదరాబాద్‌కు (HYD) చెందిన భక్తులు పుట్టంరెడ్డి ప్రతాప్ రెడ్డి, వెంకటలక్ష్మి, దీప్తి రెడ్డి ఈ భారీ కానుకను సమర్పించి వార్తల్లో నిలిచారు. భద్రకాళి అమ్మవారికి 111 కేజీల వెండితో తయారు చేసిన సర్వాంగ కవచాన్ని వీరు విరాళంగా అందించారు. ఈ వెండి కవచం తయారీకి సుమారు 4.5 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ కవచంతో పాటు మరో 21 ఆభరణాలను సదరు హైదరాబాద్ భక్తులు భద్రకాళి దేవస్థానం ఈవో సునీతకు అందజేశారు. అనంతరం పూజారులు వారి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులు సమర్పించిన ఈ వెండి కవచాన్ని పర్వదినాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించే రోజుల్లో అమ్మవారికి అలంకరిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


111 Kg Silver Bhadrakali Temple Devotees Hyderabad Devotees Latest News in Telugu Pilgrimage Silver Kavach Telugu News warangal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.