అల్లాదుర్గం( ప్రభాతవార్త) మార్చి 4. అల్లాదుర్గం మండలంలోని చిల్వర్ సమీపంలోని 161 జాతీయ రహదారిపై కారు ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం చెందారు. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం అల్లాదుర్గం గ్రామానికి చెందిన బండ సాయిలు ( 50), బండ మానెమ్మ ( 48) ద్విచక్ర వాహనంపై టేక్మాల్ మండలం బొడ్మెట్పల్లి లో జరిగిన సంత నుండి తిరిగి వస్తుండగా చిల్వర్ 161 జాతీయ రహదారిపై కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. భార్యాభర్తలు మృతి చెందడంతో అల్లాదుర్గం కాన్సిరాం నగర్ ,లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
By
Uday Kumar
Updated: March 5, 2025 • 12:37 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.