తెలంగాణ రాష్ట్రాన్ని ‘మొంథా’ తుఫాన్ తీవ్రమైన వర్షాలతో ముంచెత్తింది. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన తరువాత ఈ తుఫాన్ దిశ మార్చుకుని తెలంగాణ వైపు దూసుకొచ్చింది. భారీ వర్షాలు, గాలుల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. వరి, పత్తి, మిరప, మక్క, వంగ వంటి ప్రధాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంటలు కోత దశకు చేరుకున్న సమయంలోనే వర్షాలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. పంట చేతికొచ్చిందని అనుకున్న సమయానికే ప్రకృతి ఆటలతో అది నీటమునిగిపోయింది.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 30 అక్టోబర్ 2025 Horoscope in Telugu
పలువురు రైతులు చెబుతున్నట్లుగా, గత కొన్ని నెలలుగా విత్తనాలు, ఎరువులు, మందులు, నీటి ఖర్చులతో వారు అప్పులు చేసి పంటలు వేసారు. ఇప్పుడు ఆ పెట్టుబడి మొత్తం వర్షపు నీటిలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటలు పూర్తిగా నేలకూలిపోయి దెబ్బతిన్నాయి. మిరప తోటలు, కంది, మక్క పొలాలు కూడా ముంచెత్తే వానలకు తట్టుకోలేక తడిసి పాడయ్యాయి. పంటలు కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు వర్షాలు రావడం వల్ల రైతులకు మార్కెట్ అవకాశాలు కూడా దూరమయ్యాయి. ఇది వ్యవసాయ రంగానికి పెద్ద దెబ్బగా మారింది.

రైతుల పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపరిహార పథకాలను ప్రకటించి, పంటల నష్టం అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలను పంపాలని కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, రెవెన్యూ అధికారులను మైదానంలోకి దింపింది. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే నష్టపరిహారం ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. కానీ రైతులు మాత్రం “నష్టపరిహారం మాటల్లోనే కాకుండా చేతల్లోకి రావాలి” అంటున్నారు. ప్రకృతి విపత్తులు వరుసగా దెబ్బతీస్తున్న నేపథ్యంలో, వ్యవసాయరంగం పునరుద్ధరణకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/