📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 3 మురికి వాడల వాసుల అంగీకారం

Author Icon By Shravan
Updated: July 31, 2025 • 2:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) పథకం హైదరాబాద్ లోనూ అమలు కానుంది. నగరంలో గుడిసెలు, తాత్కాలిక నివాసాలు ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే యాకూతురా, మలక్పేట, కంటోన్మెంట్ ప్రాంతాల ప్రజలు స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. జీ+3 లేదా జీ+5 విధానంలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించనున్నారు. ఈ పథకం కోసం జీహెచ్ఎంసీకి 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందరిమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టా త్మకంగా భావిస్తోంది. ఇప్పటివరకు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అవన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ ఓ కొలిక్కి రావ డంతో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని రేవంత్ సర్కార్ (Revanth Government) భావిస్తోంది. ఇందుకోసం రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాలు క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నాయి. నగరంలో గుడిసెలు, తాత్కాలిక నివాసాలు ఉన్న ప్రాంతాల్లో స్థలాలను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చేందుకు అంగీకరించేలా స్థానికులతో అధి కారులు చర్చలు జరుపుతున్నారు. అంగీకరించని వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ఒప్పించే ప్రయ త్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు యాకూత్

గుడిసెలు, కంటోన్మెంట్లోని అంబేడ్కర్ నగర్ వాసులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో 222 ఇళ్లు నిర్మించే అవకాశ ముందని ఇందిరమ్మ ఇళ్ల రాకతో ఈ మురికి వాడలు కను మరుగవుతాయని అంటున్నారు. ముందుగా ఇక్కడే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో గుర్తింపు పొందిన మురికివాడలు 1486 ఉన్నాయి. వీటిలో దాదాపు సగానికి పైగా ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. అయితే పలు చోట్ల కొత్త మురికివాడలు వెలుస్తున్నాయి. ఈక్ర “మంలో అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులను ఇందిరమ్మ ఇళ్లకు స్థలం ఇచ్చేలా. ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Minister Narayana : సింగపూర్ లో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన-రేపు మలేషియాకు మంత్రి

Breaking News in Telugu Google News in Telugu Housing Scheme Indiramma Illu Latest News in Telugu Telangana Welfare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.