📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు ఊరట..

Author Icon By sumalatha chinthakayala
Updated: February 4, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: 2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట కలిగించింది. డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో అర్హులైన వాళ్లతో 1,382 కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని మరోసారి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాబోదని చెప్పింది. కోడ్‌ పేరుతో నియామకాలను మళ్లీ వాయిదా వేయడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ కోడ్‌ వల్ల నియామకాల ప్రక్రియ వాయిదా పడిందంటూ ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి చెప్పడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల మేరకు నియామకాలు చేసి ఈనెల 10న జరిగే విచారణ నాడు తెలియజేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో అధికారులను కోర్టుకు పిలిపించి విచారణ చేస్తామని చెప్పింది.

ఉమ్మడి ఏపీలో డీఎస్సీ-2008 నోటిఫికేషన్‌ వెలువడింది. డీఎడ్‌ అభ్యర్థులకు 30 శాతం ఎస్జీటీ పోస్టులను కేటాయించారు. దీనిపై జరిగిన న్యాయపోరాటం వల్ల పలువురు అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు. 2009లో హైకోర్టులో దాఖలైన ఈ కేసు సుప్రీంకోర్టు నుంచి తిరిగి హైకోర్టుకు చేరింది. వాటిని సోమవారం జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ తిరుమలాదేవి బెంచ్‌ విచారించింది. హైకోర్టు ఉత్తర్వుల తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందనీ, ఏపీ తరహాలో రిటైర్‌ అయ్యే వరకు కాంట్రాక్టు టీచర్లుగా కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏజీ చెప్పారు. దీనిపై న్యాయమూర్తి, ఈనెల 10వ తేదీలోగా పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పి విచారణను వాయిదా వేశారు.

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్న కేసులను కొట్టేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌లో ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ అయ్యాయి. గతంలో రేవంత్‌ ఎంపీగా ఉండగా నమోదైన కేసులను కొట్టేయాలని వేసిన పిటిషన్లను జస్టిస్‌ లక్ష్మణ్‌ సోమవారం విచారించారు. ఇందులో పోలీసులతోపాటు ఫిర్యాదుదారుకు నోటీసులిచ్చారు. విచారణ ఈనెల 20కి వాయిదా వేశారు. జన్వాడలో కేటీఆర్‌ ఫాంహౌజ్‌పైన డ్రోన్‌ ద్వారా వీడియో తీశారంటూ రేవంత్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసును కొట్టేయాలని రేవంత్‌ పిటిషన్‌ వేశారు. ఇదే తరహాలో అట్రాసిటీ కేసును కూడా కొట్టేయాలని మరో పిటిషన్‌ వేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 2021లో నమోదైన కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుకు, పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2021లో ఆహార భద్రత కార్డుల పంపిణీ సభలో మాట్లాడే సమయంలో మంత్రి మైక్‌ను లాక్కున్నారంటూ రాజగోపాల్‌రెడ్డిపై కేసు దాఖలైంది. దీన్ని కొట్టేయాలంటూ రాజగోపాల్‌రెడ్డి వేసిన పిటిషన్‌లో ప్రతివాదులైన పోలీసులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

DSC-2008 candidates High Court relief Telangana High Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.