Latest News: TG High Court: రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Read Time:  1 min
Latest News: TG High Court: రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
FONT SIZE
GET APP

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ (Hydra Commissioner Ranganath) పై అంబర్‌పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంపై హైకోర్టు (TG High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా అని ప్రశ్నించింది.

Read Also: HYD Biryani: ప్రపంచ ఉత్తమ రైస్‌ డిష్‌ల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ

High Court is extremely angry with Ranganath
High Court is extremely angry with Ranganath

కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌పై విచారణ

అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టు (TG High Court) లో ఓ మూలన నిలబెడతామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బతుకమ్మ కుంట భూవివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.

ఇదే అంశంలో గతంలోనూ హైడ్రా పనితీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తుమ్మిడికుంట పునరుద్ధరణ విషయంలో తమ ఆదేశాలను పాటించడం లేదని కోర్టు ఆగ్రహించింది. హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టుకు రోజూ దాదాపు 10 పిటిషన్లు వస్తున్నాయంది.

ప్రజలకు మంచి జరిగే పనులు మాత్రమే చేయాలని.. న్యాయస్థానం ఆదేశాలను గౌరవించాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు కలిగే నష్టంపై కోర్టు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.