📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG High Court: సిగాచీ ఫార్మా పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం

Author Icon By Aanusha
Updated: November 27, 2025 • 7:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జూన్ 30న చోటు చేసుకున్న ప్రమాదంలో 54 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదం జరిగి 5 నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ బాధ్యులు ఎవరో గుర్తించలేదు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు (TG High Court) గురువారం (నవంబర్ 27) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: Earthquake: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

తదుపరి విచారణ డిసెంబర్ 9కి వాయిదా

ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై గురువారం హైకోర్టు (TG High Court విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. “ఇప్పటికే 237 మంది సాక్షులను విచారించినా పురోగతి ఏది? పేలుడుకు బాధ్యులైన వారిని ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేదు?” అని నిలదీసింది. ఇంతటి తీవ్రమైన ఘటనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయకపోగా, కేవలం డీఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

High Court expresses anger over police investigation into Sigachi Pharma blast incident

కేసు దర్యాప్తు పురోగతిపై పూర్తిస్థాయి నివేదికను వెంటనే సమర్పించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. దర్యాప్తులో పారదర్శకత లోపించరాదని, వేగంగా పూర్తి చేసి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించింది. అనంతరం, తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

54 workers death case hc criticises investigation delay industrial accident inquiry latest news sigachi pharma blast telangana high court remarks Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.