📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rains : తెలంగాణ లో జోరుగా వర్షాలు.. అత్యధికంగా ఎక్కడంటే?

Author Icon By Sudheer
Updated: July 27, 2025 • 7:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మేఘావృత వాతావరణం కొనసాగుతుండగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రోజు పొడవునా ముసురు తప్పకుండా ఉండటం, వాన తేలిపోవకపోవడం ప్రజలను కాస్త ఇబ్బందులలో పడేసింది. అయితే వ్యవసాయం కోసం వర్షం కావలసిన ఈ సమయంలో భారీ వర్షాలు కురవడం రైతులకు ఊరట కలిగిస్తోంది.

కామారెడ్డి టాప్‌

నిన్న రాత్రి వరకు నమోదైన వివరాల ప్రకారం, అత్యధిక వర్షపాతం కామారెడ్డి జిల్లా గాంధారిలో 6.9 సెం.మీగా నమోదైంది. అదే జిల్లాలోని మేనూరులో 6.2 సెం.మీ వర్షం పడింది. నిర్మల్ జిల్లా మానాలలో 4.9 సెం.మీ, నిజామాబాద్ జిల్లా తొండకూరులో 4.7 సెం.మీ, భూపాలపల్లి జిల్లా చెల్పూరులో 4.5 సెం.మీ వర్షం నమోదైంది. అలాగే కరీంనగర్ జిల్లా గంగిపల్లిలోనూ 4.2 సెం.మీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో చెరువులు నిండి, ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి.

హైదరాబాద్‌ వర్షంతో తడిసిముద్ద

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా వర్షం తెరిపినివ్వకుండా కురుస్తోంది. ముఖ్యంగా రోడ్డులపైకి వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే హయాత్‌నగర్, అబిడ్స్, కూకట్‌పల్లి, మలక్‌పేట ప్రాంతాల్లో వర్షపాతం కాస్త ఎక్కువగానే నమోదైంది. వాతావరణ శాఖ సూచించిన ప్రకారం మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read Also : AP : పలు కమిటీలకు అధ్యక్షుల నియామకం చేపట్టిన ఏపీ సర్కార్

Google News in Telugu Heavy Rains Rains Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.