హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం భారీ వర్షం (Rain) దంచికొట్టింది. ముఖ్యంగా ఖాజాగూడ ప్రాంతంలో అత్యధికంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్సార్ నగర్లో 11 సెం.మీ, ఖైరతాబాద్లో 11 సెం.మీ, సరూర్ నగర్లో 10 సెం.మీ, గచ్చిబౌలిలో 8.5 సెం.మీ, శ్రీనగర్ కాలనీలో 6.3 సెం.మీ, రాయదుర్గంలో 5.2 సెం.మీ వర్షం కురిసింది. ఇతర ప్రాంతాలైన అమీర్పేట్, గోల్కొండ, యూసుఫ్గూడలలో కూడా 4 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదైంది.
ట్రాఫిక్ జామ్తో ప్రజల అవస్థలు
భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ఐటీ కారిడార్లలో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఈ ట్రాఫిక్ జామ్లలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది.
లోతట్టు ప్రాంతాలు జలమయం
వర్షాల కారణంగా నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. వర్షం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
Read Also : AP Police : పోలీసులు, టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారు – బొత్స