📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: Harish Rao-సింగరేణి బోనస్‌పై రేవంత్ సర్కారును విమర్శించిన హరీశ్‌రావు

Author Icon By Sharanya
Updated: September 22, 2025 • 5:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సింగరేణి కార్మికుల బోనస్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)మాటలు పెద్దవి అయినా, చేతల్లో మాత్రం శూన్యం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

లాభాలు ఉన్నా పూర్తి వాటా ఇవ్వని తీరు

ఈ ఏడాది సింగరేణి సంస్థకు రూ. 6,394 కోట్ల లాభం వచ్చినా, బోనస్‌ లెక్కల కోసం కేవలం రూ. 2,360 కోట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం అన్యాయమని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల్లో తక్కువ మొత్తాన్ని తీసుకుని వాటా పెంచినట్టు చూపించడం ఓ మోసమేనని అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వ విధానం వేరే, ప్రస్తుతది వంచన

తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ నికర లాభం ఆధారంగానే కార్మికులకు బోనస్(Bonus) ఇచ్చామని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల్లో మూడో వంతు పక్కనపెట్టి మిగిలిన లోపు వాటా ఇవ్వడం అన్యాయమన్నారు. గతేడాది కూడా ఇదే విధంగా 50% లాభాలపై కోత విధించారని తెలిపారు.

ప్రభుత్వం సమాధానం చెప్పాలి

భవిష్యత్ ప్రణాళికల పేరిట గతేడాది పక్కనపెట్టిన రూ. 2,283 కోట్లతోపాటు, ఇప్పుడు మరో రూ. 4,034 కోట్ల లాభాలపై ఏమైంది అనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుగా రావాల్సిన బోనస్‌ను ఎవరికి మళ్లిస్తున్నారో వెల్లడించాలన్నారు.

సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేస్తూ, ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకుని మొత్తం నికర లాభంపై 34% బోనస్ ప్రకటించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ నెరవేరేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/vasundhara-devi-balkampet-ellamma-temple-visit/andhra-pradesh/552162/

Breaking News BRS vs Congress harish rao latest news Singareni workers bonus Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.