📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై హ‌రీశ్‌రావు తీవ్ర విమ‌ర్శ‌లు

Author Icon By Sharanya
Updated: May 3, 2025 • 2:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మళ్లీ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)కు సంబంధించి ,ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి 42 సార్లు వెళ్లినప్పటికీ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని ఆయన విమర్శించారు.

హరీశ్ రావు ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్:

2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు కేటాయించిన MGNREGS ఉపాధి పనిదినాలను 12.22 కోట్ల నుంచి కేంద్రం 6.5 కోట్లకు తగ్గించింది. అంటే సగానికి పైగా కోత పడింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 42 సార్లు వెళ్లారు. అయినప్పటికీ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదు, కేంద్రం అన్యాయ విధానాలకు లోబడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన తీరును బట్టబయలుచేస్తోంది. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఈ తీవ్ర అన్యాయంపై మౌనంగా ఉన్నారు. వారి పని ప్రజల తరఫున నిలబడటం కాకుండా, రాజకీయ పార్టీ విధానాల వెనుక దాక్కోవడమే. ఇది దురదృష్టకరం, అని ఆయన అన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 4 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని గ్రామీణ పేదలు జీవనాధారం లేని పరిస్థితిలో ఉన్నారు. కేంద్రం వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవుతోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి, ఉపాధి పనిదినాల సంఖ్యను పునరుద్ధరించాలి. కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. వెంట‌నే కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనిదినాలను పెంచాలని, బకాయిల‌ను చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. 

Read also:Group-1 : గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

#BRS #CongressTelangana #HarishRao #PoliticalFire #RevanthReddy #TelanganaCM #TelanganaPolitics Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.