BRS Silver Jubilee : ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ బహిరంగ సభకు తరలిరావాలని – హరీష్ రావు పిలుపు

Read Time:  1 min
BRS Meeting
BRS Meeting
FONT SIZE
GET APP

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబిలీ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరుగుతున్న బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో, కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని సంకల్పించుకుని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. శనివారం సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి భారీ బహిరంగ సభల నిర్వహణలో ఉన్న ఘనతను గుర్తుచేశారు.

వరంగల్ – అతిపెద్ద సభలకు వేదిక

హరీష్ రావు మాట్లాడుతూ వరంగల్ జిల్లానే బీఆర్ఎస్ యొక్క అతిపెద్ద సభలకు వేదికగా నిలిచిందని, అందుకే కేసీఆర్ ఇక్కడే రజతోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారని వెల్లడించారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు విషయంలో విఫలమైందని, ఏడాదిన్నరలోనే ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలిసిపోయిందని విమర్శించారు. పాలను, నీటిని కూడా ప్రజలు తేడా గుర్తించగలిగే స్థితిలో ఉన్నారని ఆయన ఆరోపించారు.

వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు, సహకారం కోరిన హరీష్

వరంగల్ ప్రజలు ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీకి నిస్వార్థంగా మద్దతు ఇచ్చారని హరీష్ రావు అన్నారు. స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు బహిరంగ సభను విజయవంతం చేయడంలో సహకరించాలని కోరారు. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ తన శక్తిని మరోసారి చాటుతుందని, తెలంగాణ పునర్నిర్మాణ దిశగా పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.