📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Harisg Rao: రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్..

Author Icon By Rajitha
Updated: December 1, 2025 • 2:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతుబంధు, రుణమాఫీ, పంటల కొనుగోలు వంటి కీలక కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైదొలిగిందని ఆయన ఆరోపించారు. మూడు పంటలకు రైతుబంధు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు దానిని ఒక్క పంటకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సోయా, మక్క రైతులకు 48 గంటల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పినా 48 రోజులు గడిచినా చెల్లింపులు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి సన్న వడ్ల బోనస్‌కు సంబంధించిన రూ.1,150 కోట్లు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read also: Khammam: కుమారుడి క్రికెట్ కల కోసం పొలాన్ని మైదానంగా మార్చిన తండ్రి

Harish Rao fires at Revanth Sarkar

పాదయాత్ర చేపట్టే పరిస్థితి

సంగారెడ్డిపై ప్రభుత్వం అన్యాయం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులను నిలిపివేయడం వల్ల ప్రాంత అభివృద్ధి ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో కొత్త చెరువులకు భూసేకరణ పూర్తయినా పనులు మొదలు పెట్టకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాగే కొనసాగితే పాదయాత్ర చేపట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మల్లన్న జాతరల్లో పాల్గొన్న తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

harishrao latest news Politics RevanthReddy Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.