వరంగల్ జిల్లా హనుమకొండ(Hanumakonda) నయీంనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న తేజస్వి పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థి సురజిత్ ప్రేమ్ (9) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. ఉదయం ఇంటి నుండి ఆరోగ్యంగానే వెళ్లిన బాలుడు, తరగతిలో ఉన్నపుడు ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పితో బాధపడటం ప్రారంభించాడు.
Read also: Deepfake: డీప్ఫేక్లపై కేంద్రం కఠిన చర్యలు..

తక్షణమే పాఠశాల సిబ్బంది బాలుణ్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు బ్రెయిన్ డెడ్గా(Brain death) ప్రకటించారు. తల్లిదండ్రులు ఈ మరణంపై తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తలనొప్పి కారణంగా ఇంత వేగంగా పరిస్థితి దిగజారడం పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన – పాఠశాల యాజమాన్యం పరారీలో
సురజిత్ మృతిచెందిన విషయంతో తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట భారీ ఆందోళనకు దిగారు. వారు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పాఠశాల యాజమాన్యం తాళం వేసి పరారైంది. గమనార్హంగా, ఇదే పాఠశాలలో గత సెప్టెంబర్లో పదో తరగతి విద్యార్థి జయంత్ వర్థన్ కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. దీంతో ఈ రెండు ఘటనలు తల్లిదండ్రులలో భయాందోళనలను రేకెత్తించాయి.
పోలీసుల జోక్యం – పరిస్థితి అదుపులోకి
ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో బంధువులు పాఠశాలపై దాడి చేసేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. స్థితి ఉద్రిక్తంగా మారడంతో హనుమకొండ(Hanumakonda) ఏసీపీ నర్సింగరావు సంఘటనా స్థలానికి చేరుకుని బంధువులతో చర్చించారు. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు పరిస్థితిని సాంతం చేశారు.
మృతిచెందిన విద్యార్థి ఎవరు?
హనుమకొండ నయీంనగర్లోని తేజస్వి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ (9).
మృతి కారణం ఏమిటి?
తలనొప్పి కారణంగా బ్రెయిన్ డెడ్గా మారినట్లు వైద్యులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: