📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Hanumakonda Accident: రోడ్డు ప్రమాదం లో ముగ్గురి మృతి తో పెళ్లింట్లో విషాదం

Author Icon By Sushmitha
Updated: October 31, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్న ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హనుమకొండ(Hanumakonda) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లి బృందంలోని ముగ్గురిని బలిగొంది. మరో 12 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఎల్కతుర్తి మండలం గోపాలపురం క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగింది.

Read Also: YS Sharmila: జాతీయ విపత్తుగా గుర్తించాలి..ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా

ప్రమాద వివరాలు

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లికి చెందిన యువతికి, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు తరఫు బంధువులు వరుడి ఇంటికి వెళ్లి, కార్యక్రమాలు ముగించుకుని బొలెరో వాహనంలో(Bolero vehicle) తిరిగి మహబూబాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో గోపాలపురం క్రాస్‌ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని ఆపారు. అదే సమయంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ బోర్‌వెల్స్‌ లారీ అదుపుతప్పి బొలెరోను బలంగా ఢీకొట్టింది.

ప్రాణ నష్టం, చికిత్స

ఈ ప్రమాదం ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్‌లోని(Warangal) ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 12 మంది ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పెళ్లింట జరిగిన ఈ ప్రమాదంతో ఇరు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Hanamkonda accident Latest News in Telugu marriage party police investigation. road tragedy Telugu News Today vehicular collision

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.