సుబేదారి: హనుమకొండ జిల్లా (Hanumakonda) హంటర్ లోని కాకతీయ జూ పార్కులో (Kakatiya Zoo Park) 14 సంవత్సరాల తెల్ల పులి మరణించింది పులులు సాధారణ జీవిత కాలం 12 సంవత్సరాలు కానీ ఈ తెల్ల పులి 14 సంవత్సరాలు జీవించి వృద్ధాప్య, గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి మయూరి మాట్లాడుతూ… పులి వృద్ధాప్యంతో పాటు గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందన్నారు. తెల్ల పులి వయస్సు దృష్ట్యా గత కొంతకాలంగా ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచామని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆమె వెల్లడించారు.
Read Also: TG: గిరిజన రైతులకు జల వికాసం

(Hanumakonda) కాకతీయ జూ పార్కులో ఈ తెల్ల పులి సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉండేదని, దాని మృతి జూ పార్కుకు తీరని లోటుగా భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పులి మరణ వార్త తెలుసుకున్న జూ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా జూ పార్కుల్లో ఉన్న జంతువుల ఆరోగ్యం, భద్రతపై అటవీ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: