हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Gram panchayat elections : గ్రామ పంచాయతీ ఎన్నికలు కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు…

Sai Kiran
Gram panchayat elections : గ్రామ పంచాయతీ ఎన్నికలు కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు…

Gram panchayat elections : మక్తల్/హైద‌రాబాద్: గ్రామాల సమగ్ర అభివృద్ధికి సామర్థ్యవంతులైన నాయకులను సర్పంచులుగా ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే పార్టీలకు మద్దతు ఇవ్వవద్దని హెచ్చరించారు.

మక్తల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎన్నుకొని తమపై విశ్వాసం ఉంచారన్నారు. (Gram panchayat elections) తమ ఆశీస్సుల వల్లే తాను దేశంలోనే పిన్నవయసు రాష్ట్రమైన తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు చెప్పారు.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాలమూరు జిల్లా కేసీఆర్‌కు మద్దతిచ్చిందని, ఆయనను లోక్‌సభ సభ్యుడిగా కూడా ఎన్నుకున్నప్పటికీ, 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. “పాలమూరుకు అభివృద్ధి కోసం కనీసం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కొడంగల్–నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పట్టించుకోలేదు,” అని మండిపడ్డారు.

Read also: Nara Lokesh : ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పులు మోపింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని సీఎం అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించటం తన బాధ్యత అని స్పష్టం చేశారు.

తెలంగాణను తిరిగి అభివృద్ధి మార్గంలో తీసుకురావడానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర పెట్టుబడి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతూ భారీ ఇన్వెస్ట్‌మెంట్లు రాబడతామన్నారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యమని చెప్పారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, తెల్ల రేషన్ కార్డు సన్నబియ్యం, రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రెండేళ్లలో రైతుల సంక్షేమానికి రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు చేశామని, మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాల కోసం కులగణన చేపట్టామని, ఎస్సీలకు ఉపవర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే అని సీఎం వెల్లడించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870