ఇద్దరు తెలంగాణ వ్యక్తులను గోవా (Goa) పోలీసులు అరెస్టు చేశారు గోవాలో ఓ విదేశీ మహిళను వేధించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో తెలంగాణకు (Telangana) చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. పోలీసుల సమాచారం ప్రకారం గోవాలోని ఓ బీచ్ ప్రాంతంలో విదేశీ మహిళను కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించి వేధించినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఈ ఘటనకు పాల్పడిన వారు తెలంగాణకు చెందినవారని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: Government Rules: చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!
పర్యాటకులు వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు నిర్ణయం
(Goa) పర్యాటకుల అనుమతి లేకుండా అపరిచితులు, ఇన్ఫ్లూయెన్సర్లు లేదా ఫోటోగ్రాఫర్లు వారి చిత్రాలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో ప్రచురించడం పూర్తిగా నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు. ఫోటోలు తీసేందుకు టూరిస్టులపై ఒత్తిడి చేయడం లేదా బలవంతపెట్టడం కూడా చట్టవిరుద్ధమని తెలిపారు. అయితే బీచ్లు, పబ్లిక్ ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాల ఫోటోలు సాధారణంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. కానీ ఎవరికైనా వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని చిత్రీకరించడం మాత్రం నియమాలకు వ్యతిరేకమని హెచ్చరించారు. పర్యాటకులు వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు, ముఖ్యంగా వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: