సైఫాబాద్ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు 4 కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల(Trade Unions), ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యం లో ఈ నెల 9వ జరిగే దేశవ్యాప్త సమ్మెలో (General strike) బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవం తం చేయాలని ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్. రాంబాబు పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మె (General strike) సన్నద్ధంలో భాగంగా శుక్రవారం ఎఐబిఇఎ రాష్ట్ర కార్యాలయంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ (యుఎఫ్సియు) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం (Round table meeting) లో ఆయన ప్రసంగించారు.
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
ఈ సమావేశానికి పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ కో-ఆర్డినేటర్ వి. ఎస్.బోస్ అధ్యక్షత వహించగా, రౌండ్ టేబుల్ సమావే శంలో యుఎఫ్పియు కన్వీనర్ ఎన్.వి.రమణ, ఎఐపిఆర్ డిఎ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. జలాలుద్దీన్, ఎం. శివశంకర్ (జిఐజిఎఐఎ, తెలంగాణ), పి.అజయ్కుమార్, పి.ఉదయ్ భాస్కర్ (డిజిఎస్-ఎపిటిబిఇఎఫ్), ఎఐబిఒఇ అధ్యక్షుడు పిఎసిపిఆర్ పణికుమార్, జిఐఇఎఐఎ ఆర్గనైజింగ్ సెక్రటరీ సి. కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బి.ఎస్. రాంబాబు మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాల పేరుతో కేంద్ర ప్రభుత్వం తిరగమన పోకడలను అనుసరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల ను ప్రైవేటు పరం చేసేందుకు నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. వి.ఎస్. బోస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ రంగానికి అనేక రాయితీలు ఇస్తూ, కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆరోపిం చారు. 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా 25 కోట్లమంది సంఘటిత, అసంఘిటిత కార్మికులు, రైతులు, బ్యాంకింగ్, బీమారంగ ఉద్యోగులు పాల్గొంటున్నారని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Govt Schools : తెలంగాణ లో కొత్తగా 157 సర్కారీ బడులు