రూ.3.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
Ganja Seized: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Rajiv Gandhi International Airport) కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిం చేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం, హనోయ్ నుంచి కౌలాలంపూర్ మీదుగా ఎయిర్ ఏషియా ఏకే-069 విమానంలో హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
Read Also: Andhra Pradesh: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!
తనిఖీల్లో దొరికిన గంజాయి
వారి లగేజీని స్కానింగ్ చేయగా అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దీంతో అధికారులు లగే జీని పూర్తిగా తనిఖీచేయగా అందులో నిషేధిత మాదకద్రవ్యం అయిన గంజాయిని దాచినట్లు గుర్తించారు. అధికారులు మరింత లోతుగా పరిశీలించగా 9.10 కిలోల గంజాయి స్వాధీనం అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.3.18 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. నిందితులు గంజాయిని ప్రత్యేక ప్యాకెట్లలో దాచి పెట్టి తరలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ఇద్దరు నిందితులు అరెస్ట్
ఈ ఘటనలో ఇద్దరు నిందితులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసి వారి మీద కేసు నమోదు చేశారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఎవరికి అందించేందుకు ప్రయత్నించారు అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వెనుక ఉన్న అంతర్జాతీయ ముఠా సంబంధాలపై కూడా విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో విదేశాల నుంచి విమానాల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. అనుమా నాస్పదంగా కనిపించే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: