థర్మల్, సోలార్ విద్యుత్ ప్లాంట్లకు (For solar power plants) తోడు, సింగరేణి Singareni సంస్థ ఇప్పుడు కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో ఏర్పాటు చేయనున్న “పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్”తో భారత విద్యుత్ రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.రామగుండం-1 ప్రాంతంలోని మూతపడిన మేడిపల్లి గనిలో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమిక అధ్యయనం ఇప్పటికే పూర్తైంది. పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్కి లెటర్ ఆఫ్ అవార్డ్ ఇచ్చింది.ఇది రాష్ట్రంలో ఇదివరకు ఎక్కడా చేపట్టని విధంగా ప్రయోగాత్మకంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, భవిష్యత్లో ఇలాంటి మరిన్ని ప్లాంట్లకు మార్గం సిద్ధమవుతుంది.
విద్యుత్ ఉత్పత్తికి వినూత్న మెకానిజం
పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు సాధారణ జల విద్యుత్ కేంద్రాలలానే పనిచేస్తాయి. అయితే, ఇక్కడ నీటిని పైకి పంపించి, అవసరమైనప్పుడు కిందకి విడుదల చేస్తారు. టర్బైన్లు తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.మేడిపల్లిలోని గనిలో ఇప్పటికే భారీ నీటి నిల్వ ఉంది. దీనిని ఉపయోగించి ఉపరితలంలో మరో రిజర్వాయర్ నిర్మిస్తారు. పగటిపూట సోలార్ పవర్తో నీటిని పైకి పంపించి, రాత్రి విద్యుత్తుగా మార్చుతారు.
ప్రాజెక్ట్ వివరాలు – ఖర్చు, సామర్థ్యం, భవిష్యత్తు
ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మించనున్న డ్యాం పొడవు సుమారు 2,350 మీటర్లు. నీటి నిల్వ సామర్థ్యం 9.64 మిలియన్ క్యూబిక్ మీటర్లు. విద్యుత్ ఉత్పత్తికి 8 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు వినియోగిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్ట్కు రూ.3000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
40 ఏళ్ల పాటు 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ఈ ప్లాంట్ పూర్తిగా పనిచేస్తే, సింగరేణికి సంవత్సరాల పాటు స్థిర ఆదాయం లభిస్తుంది. డీపీఆర్ సిద్ధమైన వెంటనే నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు.హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎండీ ఎన్. బలరామ్ సహా పలువురు డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
Read Also : Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ లో కొట్లాట..?