హైదరాబాద్ : రాష్ట్రం లోని సంక్షేమ శాఖలకు సంబంధించిన గురుకుల విద్యా లయాల్లో తరచూ జరుగుతున్న ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటనలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి ) ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రం లో జరిగిన 886 ఫుడ్ పాయిజన్ ఘటనల్లో 48 మంది మృతికి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిం చింది. రాష్ట్రంలో నమోదైన 109 మానవ హక్కుల ఉల్లంఘనల కేసులకు సంబంధించి జూబ్లీ హిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వన రుల అభివృద్ధి సంస్థలో రెండు రోజుల పాటు హ్యూమన్ ట్ కమిషన్ చేసిన బహిరంగ విచారణ ముగిసింది. రాష్ట్రంలో నమోదైన కేసు ల్లో 87 కేసులు క్లోజ్ చేసింది. ఈ విచారణ సం దర్భంగా ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఎన్జీఓ లు, మానవహక్కుల ఉద్యమకారులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించింది. దీంతో పూర్తి వివ రాలతో 4వారాల్లో నివేదిక సమర్పించాలని ఎన్హెన్ఆర్సీ అధికారులను ఆదేశించింది. అనంతరం కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ వి రామ సుబ్రమణియన్ (Subramanian) మీడియాతో మాట్లాడారు. దేశంలో మానవహక్కుల ఉల్లంఘనలకు సంబం ధించి ఎన్పాచైర్సీకి ప్రతిరోజు 250 వరకు ఆన్లైన్ ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Fertilizer: రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయింపు-మంత్రి తుమ్మల