📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Latest News: Floods: భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత మూడురోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. హుస్సేనాసాగర్, మూసీ (Musi River)లలో అకస్మాత్తుగా వరద నీరు పెరిగింది.

దీంతో మూసీలో వరద పెరగడంతో పూజారి కుటుంబం వరదలో చిక్కుకునిపోయింది. అలాగే శివాలయంలో నలుగురు వ్యక్తులు చిక్కుకునిపోయారు. ఘట్కేసర్ మండలంలోని మూసీ వంతెలనపై వరదనీరు ప్రవహిస్తోంది. ప్రతాపసింగారం, కొర్రెముల వద్ద మూసీ వంతెనపై నుంచి వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తోంది. వంతెనలపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రోడ్లపై వాహనాల రాక పోకలను తీవ్ర ఆటంకం ఏర్పడింది.

TGSRTC: MGBS నుంచి బస్సుల రాకపోకలు బంద్..కారణం ఏంటంటే?

చాదర్ ఘాట్లో నీట మునిగిన ఇళ్లు

భారీ వర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చాదర్ ఘాట్ (Chadar Ghat) సమీపంలోని ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. అకస్మాత్తుగా ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. మూసారాంబాగ్ వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తున్నాయి. దీంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారు.

దీంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మూసీ వెంట లోతట్టు ప్రాంతాల విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. ముంపు కాలనీల వాసులకు పునరావాసం కల్పించాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు.

కుండపోత వర్షాలు

రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్ సాగర్, కిస్మత్ పూర్, గండిపేట్, శంషాబాద్, కార్వాన్, జియాగూడ, లంగర్ హౌస్ ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డిలు ఇక్కడి
పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

చాదరూట్ వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

చాదర్ ఘాట్ వద్ద చిన్న వంతెనపై ప్రమాదకరంగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఈ వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపి వేసారు. ఇక్కడి పలు కాలనీలలో వరదనీరు చేరింది. దీంతో అధికారులు ప్రజలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.మరో రెండురోజులు వర్షాలు తప్పవు కావున, అవసరం అయితే బయటకు రావాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Heavy Rain Hyderabad Hyderabad flood news latest news low lying areas submerged Musi River Flood pujari family trapped sudden water rise Telugu News temple flooded

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.