సర్కార్కు చేరిన కాగ్ నివేదిక
హైదరాబాద్ : తెలంగాణ (Finance) రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. తెలంగాణ (TG) మొత్తం ఆదాయ వసూళ్లు రూ.1,24,911.19 కోట్లుగా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలైన 5.2,29,720. 635 54.38. 2024-2555 ఇదే కాలంలో సాధించిన 50.76 శాతం కంటే 3.62 శాతం మెరుగుదల చోటు చేసుకుంది. ఖర్చుల విషయానికొస్తే రూ.1,77,204.16 కోట్లకు చేరుకుంది. ఇది బడ్జెట్ మొత్తంలో 67.25 శాతం. గత సంవత్సరం ఇది 61.87 శాతం కంటే ఎక్కువ.
డిసెంబర్ 2025 తో ముగిసిన కాలానికి తెలంగాణ ఆర్థిక స్థితిపై కంప్రోలర్, ఆడిటర్ జనరల్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఆదాయ స్థితిలో గణనీయమైన మెరుగుదలను హైలైట్ చేసింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రసీదులు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు, వస్తు, సేవల పన్ను నుండి బలమైన వసూళ్లతో పాటు, పన్నుయేతర ఆదాయాలలో స్థిరమైన పెరుగుదల నమోదైంది. కాగ్ నివేదిక ప్రకారం పన్నుల ఆదాయం ఖజానా ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు అతిపెద్ద సహకారిగా కొనసాగుతోంది.
Read Also: Telangana:మున్సిపాలిటీల్లో ‘ఇందిరమ్మ చీర’ పంపిణీ ప్రారంభం
పెరిగిన పన్నుల ఆదాయం
రూ.1,13,985.07 కోట్లకు చేరుకున్న పన్నుల ఆదాయం బడ్జెట్లో 65.02 శాతంగా (గత ఏడాది 62.07 శాతం) ఉంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వసూళ్లు రూ.39,004.84 కోట్లకు చేరుకున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పెరిగి రూ.11,304.19 కోట్లతో వార్షిక లక్ష్యంలో 59.22 శాతానికి (41.28 శాతం) చేరుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు గణనీయంగా పెరిగి రూ.17,507.01 కోట్ల వసూళ్లతో బడ్జెట్లో 63.38 శాతంగా (54.96 ) 5.7,120.53 కోట్లుగా నమోదైంది. ఇది బడ్జెట్ అంచనాలలో 22.52 శాతం కాగా, గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 15.59 శాతం కంటే ఎక్కువ. అయితే గ్రాంట్స్ ఇన్ఎయిడ్ మరియు విరాళాలు రూ.3,805.59 కోట్లతో సాపేక్షంగా తక్కువగా ఉన్నాయి. ఇది వార్షిక అంచనాలో 16.7 శాతానికి మాత్రమే.
అంతకుముందు ఇది 22.05 శాతంగా ఉంది. (Finance) అలాగే మూలధన వసూళ్లు అంచనాలను మించిపోయాయి. బడ్జెట్ అంచనా అయిన రూ.55,116.67 కోట్లకు గాను రూ.65,965.32 కోట్లు సమకూరింది ఇది 119.68 శాతం విజయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఎక్కువగా రుణాలు, ఇతర అప్పుల ద్వారా నమోదై వార్షిక లక్ష్యాన్ని దాటి రూ.65,930.31 కోట్లుగా నిలిచింది. రెవెన్యూ వ్యయం రూ.1,34,512.21 కోట్లు కాగా, జీతాలు మరియు వేతనాలు సహా ప్రధాన భాగాలు రూ.35,746.99 కోట్లు, వడ్డీ చెల్లింపులు 5. 21,454.17 5, 5.14,126.99 5 గతంలో అంచనా వేసిన మిగులు స్థితితో పోలిస్తే డిసెంబర్ 2025 నాటికి రాష్ట్రం రూ.9,601.02 కోట్ల రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు రూ.65,930.31 కోట్లుగా ఉంది. రెవెన్యూ వసూళ్లు మెరుగుపడినప్పటికీ, పెరుగుతున్న వ్యయం మరియు అధిక రుణాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయని కాగ్ పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: