తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం తీవ్రరూపం దాల్చింది. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అన్ని రకాల సినిమా షూటింగ్లను తక్షణమే నిలిపివేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Film Chamber of Commerce) నిర్మాతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో టాలీవుడ్లో చిత్రీకరణలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి.
ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లు డిమాండ్
గత కొంతకాలంగా సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని, వాటిని రోజువారీగా చెల్లించాలని ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లు(Film Federation Union) డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనను నిర్మాతల మండలి అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు కనీస వేతనాల కన్నా ఎక్కువే ఉన్నాయని, ఫెడరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఫిల్మ్ ఛాంబర్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ల నిలిపివేతకు పిలుపునిచ్చింది.
షూటింగ్లు జరపవద్దని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం
ఈ సమస్యను పరిష్కరించేందుకు గురువారం కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ నాయకులతో సమావేశం జరిగింది. అయినప్పటికీ, ఈ భేటీలో ఎలాంటి సయోధ్య కుదరలేదు. ఈ వివాదాన్ని పరిశ్రమ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ వీర శంకర్ తెలిపారు. అప్పటివరకు ఎలాంటి షూటింగ్లు జరపవద్దని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
తెలుగు సినిమాలకు ప్రధాన కేంద్రం ఏది?
ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు మరియు డి. రామానాయుడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం వరకు, తెలుగు సినిమా పరిశ్రమలోని పెద్ద విభాగాలు చెన్నై నుండి పనిచేశాయి. కానీ నేడు, తెలుగు సినిమా నిర్మాణ కార్యకలాపాలన్నీ హైదరాబాద్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి.
రఘుపతి వెంకయ్య నాయుడు
రఘుపతి వెంకయ్య నాయుడు, తరచుగా తెలుగు చిత్ర పరిశ్రమ పితామహుడిగా పరిగణించబడతారు, స్టార్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్స్ మరియు గ్లాస్ స్టూడియోను స్థాపించిన మార్గదర్శక వ్యక్తి.
Read hindi news: hindi.vaartha.com
Read also: