హైదరాబాద్ (మెహదీపట్నం) : తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు బకాయిలు (Fee dues) కూడా చెల్లించలేని అసమర్థ పాలన కొనసాగుతుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఘాటు గా విమర్శించారు. ఇలాంటి అసమర్థ పాలన ఉన్నా ఒకటే, పోయినా ఒకటే అన్నారు. సోమ వారం బిసి విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు బకా యిలు వెంటనే చెల్లించాలని, ప్రైవేటు యూని వర్సిటీలలో బిసి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాసబ్యాంక్లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భవన్ను ముట్ట డించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగి పోయింది. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లా డుతూ తెలంగాణలో 14. లక్షల మంది కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు ఏకంగా రూ.6.వేల కోట్లు (Rs.6,000 crore) పెండింగ్లో ఉన్నాయన్నారు. పేద విద్యార్థులకు చదువుకునేందుకు ఉపయోగపడే ఈ స్కాలర్షిప్ విధానంను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. విద్య రాజ్యాంగబద్ధమైన హక్కు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు లక్షల కోట్ల అప్పులు చేస్తూ, విద్యార్థుల ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్ బకాయిల కోసం ఎందుకు అప్పులు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20. నెలలవుతున్నా 20 పాయలు కూడా స్కాల ర్షిప్ ల కోసం విడుదల చేయలే దన్నారు. బడ్జెట్ లో రూ.5 వేల కోట్లు కేటాయించి ఓక్క రూపా కూడా ఇవ్వక పోవడం దారుణమ న్నారు. షిప్లను స్కాలర్ విడుదల చేయకపోతే లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవు తారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సర్కారు స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను మంజూరు చేయాలని, లేనిఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ముట్ట డిలో విద్యార్థి సంఘం నాయకులు నందగో పాల్, మణికంఠ, శివ, ప్రీతం, నిఖిల్, ధనూష్తో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :