📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Accident : ఖమ్మం జిల్లా తల్లాడ లో ఘోర ప్రమాదం , ఇద్దరు మృతి

Author Icon By Sudheer
Updated: December 29, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. అంజనాపురం సమీపంలోని శంకర్ దాబా వద్ద వేగంగా వస్తున్న కారు, లారీ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం ప్రకారం కారులో ప్రయాణిస్తున్న వారు ఒడిశాలో జగన్నాథ యాత్రను ముగించుకుని తమ స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. చీకటిగా ఉన్న సమయంలో జరిగిన ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పోలీసులు మృతులను జనగామ జిల్లా జఫర్‌గఢ్‌కు చెందిన చిల్లర బాలకృష్ణ (కార్ డ్రైవర్), రాయల అనిల్‌గా గుర్తించారు. మృతదేహాలను వాహనం నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి మరణవార్తతో జఫర్‌గఢ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. యాత్రకు వెళ్లి సురక్షితంగా తిరిగి వస్తారనుకున్న వారు, ఇంటికి చేరకముందే విగతజీవులుగా మారడం వారి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

మరోవైపు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజయ్, కొల్లిపాక క్రాంతి, గట్టు రాకేష్‌లను పోలీసులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి స్వగ్రామం స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఉప్పుగల్లుగా పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు.

Accident Google News in Telugu Khammam Latest News in Telugu Thallada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.