📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Farmers: టార్పాలిన్ సరఫరా నిలిపివేతతో రైతుల ఆందోళన

Author Icon By Tejaswini Y
Updated: November 18, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ :ఆరుకాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను అరబెట్టుకోవటానికి వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు(Farmers) నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు టార్పిలిన్లు రైతులకు ఇప్పుడు అత్యవసరం. వరి, కంది, ఇతర అంతర పంటలు సాగు చేసిన రైతులకు ధాన్యం ఆరబెట్టేందుకు తమ పొలాల్లో టార్ఫిలిను ముఖ్యంగా కావాల్సి ఉంది.

Farmers’ concern over suspension of tarpaulin supply

Read Also:  10th పబ్లిక్‌ పరీక్షల తేదీలు విడుదల?

గతంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లను రైతులకు(Farmers) సరఫరా చేసేది. వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షిచుకోవటానికి వ్యవసాయ శాఖ గతంలో సబ్సిడీపై రైతులకు టార్పిలిన్లు అందించేది. మార్కెట్లో 2,500 రూపాయలకు లభించే టర్పిలిన్లను 50 శాతం సబ్సిడీతో 1,250 రూపాయలకే రైతులకు సరఫరా చేసేది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ శాఖ టార్పాలిన్ల సరఫరాను నిలిపివేసింది. దీంతో మార్కెట్లో టార్పలిన్ల ధరలు అధికంగా ఉండటంతో వాటిని కొనలేక రైతులు అద్దెకు తెచ్చుకుంటున్నారు.

ఒక్కో టార్పాలిన్కు రోజుకు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవటానికి సాధారణంగా ప్రతీ రైతు కనీసం ఆరు నుంచి 10 టార్పాలిన్లు అవసరం ఉంటుంది. వాటిపై ప్రతీ రోజు అద్దెకు తెచ్చుకోవటంతో భారం పడుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కోత దశకు రావటంతో రైతులంతా కోత మిషన్లతో వరి పంటను కోయిస్తున్నారు. ఇప్పుడు అకాల వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

agriculture AgricultureDept CropProtection FarmerProblems FarmerProtest Farmers SupplyHalt TarpaulinIssue TelanganaFarmers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.