📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Farmers: రైతు సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం

Author Icon By Vanipushpa
Updated: July 15, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసిన డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క,

మంత్రి పొంగులేటి

కూసుమంచి (ఖమ్మం జిల్లా): కృష్ణా నది(Krishna) నీటిని తెలంగాణ రాష్ట్రం(Telangana State) సమృద్ధిగా వినియోగించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(DCM Bhatti Vikramarka) అన్నారు. డిప్యూటీ సీఎం, రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల -మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి, కూసుమంచి మండలంలో పర్యటించి, పాలేరు వద్ద పాలేరు రిజర్వాయర్ నుండి నాగార్జున సాగర్ లెఫ్ట్ లాల్ బహదూర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు ఖరీఫ్ సాగుకు సాగు నీటిని విడుదల చేసారు.

Formers: రైతు సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం

పాలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగునీరు నేడు విడుదల

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ నాగార్జున సాగర్ జోన్ 2, పాలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగునీరు నేడు విడుదల చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ రంగం, విద్యుత్, బహుళ సార్ధక ప్రాజెక్టులకు మన ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి
చేయడంలో రైతాంగం 65 శాతంమంది. వ్యవసాయం పై ఆధారపడి ఉన్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాలేరు రిజర్వాయర్ కింద ఉన్న 2 లక్షల 53 వేల ఎకరాల నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశామని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, నాగార్జునసాగర్ ప్రధాన కాలువ, అనేక యూటీ లు కొట్టుకు పోయాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేశామని తెలిపారు. ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని, క్రమ పద్ధతిలో 5 రోజులలో పూర్తి సామర్థంతో నీటి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Murder: కాంగ్రెస్ యువ నాయకుని దారుణ హత్య

#telugu News agricultural policies farmer support schemes farmer welfare Good Governance government initiatives pro-farmer policies Rural Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.