📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

జనవరి 26 నుంచి రైతు భరోసా

Author Icon By Vanipushpa
Updated: January 21, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైతు భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.
ఈ పథకంలో భాగంగా ఎకరానికి ఏడాదికి రూ.12 వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించింది.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధం లేదని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నేతలు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలలో ఒకటిగా ఈ పథకాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, రైతు డిక్లరేషన్‌లోనూ చెప్పింది.
అయితే, దఫదఫాలుగా సాయాన్ని పెంచుమతాని చెబుతోంది ప్రభుత్వం. జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పిన రైతు భరోసా పథకం కింద రూ. 12 వేలు ఇస్తామని తాజాగా ప్రకటించింది ప్రభుత్వం.

హామీకీ, ఆచరణకు పొంతన లేకపోవడంపై అభ్యంతరం చెబుతోంది తెలంగాణ రైతు సంఘం. ”అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగం ఓట్లు ఆకర్షించేందుకు మేనిఫెస్టోలో రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో కమిటీ ఏర్పడింది.కమిటీ సిఫార్సుల ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వరాదని మంత్రివర్గ ఉపసంఘం చేసిన కీలక సిఫార్సు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గ్రామాల వారీగా సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేసి, దాని ఆధారంగా 26వ తేదీ నుంచి రైతు భరోసా సాయం అందించనున్నారు.

jan 26th rythu bharosa Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.