📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్

Author Icon By Sudheer
Updated: February 6, 2025 • 8:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ రోజు ఏదో ఒక నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో, తాజాగా మరో ఫేక్ ఉద్యోగిని గుర్తించి అరెస్ట్ చేశారు.

సచివాలయంలో తహసీల్దార్ పేరిట అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన కొంపల్లి అంజయ్య అనే వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అతడు తన వాహనంపై తహసీల్దార్ స్టిక్కర్ అతికించుకుని గత కొన్నిరోజులుగా సచివాలయంలోకి రావడం అనుమానాస్పదంగా మారింది. ఈ విషయం గమనించిన ఎస్పీఎఫ్ (SPF) సిబ్బంది ఐబిఎస్ఐ యూసఫ్, ఆంజనేయులు అతడిని నిలువరించి ప్రశ్నించారు.

telangana secretariat

దర్యాప్తులో అంజయ్య ఫేక్ ఐడీ కార్డు ఉపయోగించి సచివాలయంలోకి ప్రవేశిస్తున్నట్లు తేలింది. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుండి నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, అతడు ఈ దందాను ఎలా నిర్వహించాడనే అంశంపై లోతుగా విచారణ ప్రారంభించారు.

పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. నకిలీ ఐడీ కార్డును అంజయ్య ఒక జిరాక్స్ సెంటర్‌లో తయారు చేయించుకున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరికెవరికీ సంబంధం ఉందో తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరలుకోకుండా భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని సెక్రటేరియట్ అధికారులు యోచిస్తున్నారు.

ఈ తరహా నకిలీ ఉద్యోగుల దందాపై ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సచివాలయ భద్రతను మరింత కఠినతరం చేసి, ఫేక్ ఐడీ కార్డుల తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ ఉద్యోగుల వెనుక ఎవరైనా భారీ ముఠా ఉందా? మరికొంత మంది ఇదే విధంగా వ్యవహరిస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

fake employees Secretariat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.