📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rajeev Yuva Vikasam Scheme :’రాజీవ్‌ యువ వికాసం’ గడువు పొడిగింపు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 1, 2025 • 8:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajeev Yuva Vikasam Scheme : రాజీవ్‌ యువ వికాసం పథకం గుడువును ఏప్రిల్‌ 14 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇది వరకు షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 4 వరకు ఉండగా.. పలువురి విజ్ఞప్తి మేరకు పొడిగించినట్టు సమాచారం. ఈ పథకంలో భాగంగా 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల రునాలను 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి రేషన్‌ కార్డు లేదా ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటో అవసరం. వెబ్‌సైట్‌ https://tgobmms.cgg.gov.in/ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం

వ్యవసాయేతర పథకాలకు వయసు 21 – 55 మధ్య ఉండాలి. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. రూ.50 వేల యూనిట్లకు 100 శాతం సబ్సిడీ, రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్య యూనిట్లకు 90 శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.80 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ అందిస్తారు. మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ల ద్వారా ప్రభుత్వం సమకూరుస్తుంది.

పథకాన్ని పకడ్బందీగా అమలు

రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ-1 కింద రూ. 1 లక్ష, కేటగిరీ-2 కింద రూ. 2 లక్షలు, కేటగిరీ-3 కింద రూ. 3 లక్షల రుణాలను అందజేయనుండగా, వరుసగా 80 శాతం, 70 శాతం, 60 శాతం రాయితీ లభిస్తుంది. ఈ పథకం అమలు తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Government Schemes Latest News in Telugu Paper Telugu News Rajiv Yuva Vikasam telangana government Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.