📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

నాంప‌ల్లి నుమాయిష్ 17వ తేదీ వ‌ర‌కు పొడిగింపు

Author Icon By sumalatha chinthakayala
Updated: February 11, 2025 • 7:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతి

హైదరాబాద్ : నగర ప్రజలు ఎంతగానో ఎంజాయ్ చేసే నాంపల్లి నుమాయిష్ మరో రెండు రోజులు కొనసాగనుంది. ఫిబ్రవరి 15న ఎగ్జిబిషన్ పూర్తవనుండగా.. ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్ ఉండనుందని నిర్వాహకులు ప్రకటించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానం లో కొనసాగుతున్న 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతించిందని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు కే నిరంజన్, కార్యదర్శి బి సురేందర్ రెడ్డి, సభ్యులు సుఖేష్ రెడ్డి, ధీరజ్ జైస్వాల్‌లు పేర్కొన్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ ను ఆయన కార్యాలయంలో కలిసి ఎగ్జిబిషన్‌ను ఈనెల 17వ తేదీ వరకు పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం సమర్పించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సెక్రటరీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుండి ప్రారంభమయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఈ సంవత్సరం మూడవ తేదీ నుంచి ప్రారంభించడం జరిగిందని, దీంతో స్టాల్ యజమానులు ఎగ్జిబిషన్‌ను పొడిగించాలని విన్నవించారని తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు పోలీస్ శాఖ అనుమతి కోసం వినతిపత్రం సమర్పించామని కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.

కాగా, 1938లో నిజాం కాలంలో మొదలైన నాంపల్లి నుమాయిష్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి సందర్శకులు, స్టాల్స్ నిర్వాహకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దేశంలోని అన్ని రకాల బ్రాండ్ ఉత్పత్తులతో పాటు, హస్తకళల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే ఫుడ్ కోర్టులు, పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసేందుకు గేమ్ జోన్స్ కూడా ఉంటాయి.

CP CV Anand Google news Latest News in Telugu Nampally exhibition Nampally Numaish Exhibition Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.